ధైత అమ్మవారికి అభిషేకాలు
మన్యం టీవీ మంగపేట.
రెండో యాదగిరి గుట్టగా ప్రసిద్ధి చెందిన ములుగు జిల్లా మంగపేట మండలంలోని శ్రీ హేమాచల (మల్లూరు) లక్ష్మీ నృసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం ప్రత్యేక పూజల అనంతరం సదస్యం (వేద ఆశీర్వచనం) కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ కార్యనిర్వాహణాధికారి బీ.సత్యనారాయణ పర్యవేక్షణలో ఆలయ అర్చకులు కైంకర్యం రాఘవాచార్యులు, ముక్కామల రాజశేఖర శర్మ, కారంపూడి పవన్ కుమారాచార్యులు, బ్రహ్మోత్సవాల నిర్వాహక పూజారులు, భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయ అర్చకులు అమరవాది మురళీకృష్ణమాచార్యులు, వారి బృందం ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం సుప్రభాత సేవ, విష్వక్సేన పూజ, మండపారాధన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ సమీపంలోని ధైత అమ్మ వారికి(వనదేవత) క్షీరాభిషేకం, చందనాభిషేకం,జలాభిషేకం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం స్వామి వారి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలకు నూతన వస్త్రాలు అలంకరించి కళ్యాణ మండపంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం చతుర్వేద, ఇతిహాస పురాణాలు పారాయణం చేసి సదస్యం (వేదాశీర్వచనం) కార్యక్రమం నిర్వహించారు.
Post A Comment: