మన్యం టీవీ ఏటూరు నాగారం:
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామానికి చెందిన శ్రీ సమ్మక్క సారలమ్మ ప్రధాన పూజారి సిద్దబోయిన సమ్మరావు అతని భార్య సృజన ఇటీవల మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఊరటం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ జగన్నాథం ఇటీవలే మరణించగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే సీతక్క, అదేవిధంగా ఊరట్టం గ్రామంలో కరోనా తో బాధపడుతున్న కుటుంబాలను పరామర్శించి నిత్యావసర సరుకులు అందించిన సీతక్క. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నల్లెల కుమార స్వామి, తాడ్వాయి మండల అధ్యక్షుడు ఆనంత రెడ్డి, సహకార సంఘం చైర్మన్ పులి సంపత్ గౌడ్, మాజీ ఎంపీటీసీ బత్తిని రాజు, ఎస్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు పీరీల వెంకన్న, మేడం రమణాకర్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: