మన్యం టీవీ: ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండల జర్నలిస్టులు ప్రతి ఒక్కరు క్షేమంగా ఉండాలని ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ అన్నారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కొరకు కోవిడ్ వ్యాక్సిన్ రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేసిందని ప్రతి ఒక్కరూ జర్నలిస్టులు తప్పకుండా టీకా వేయించుకోవాలని సూచించారు. సింగరేణి హైస్కూల్లో ఏర్పాటు చేసినటువంటి వ్యాక్సిన్ కేంద్రాన్ని ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ప్రారంభించినారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ దిండిగాల రాజేందర్, రైతు సమన్వయ రాష్ట్ర నాయకులు పులిగండ్ల మాధవరావు, ఇల్లందు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు సువర్ణ పాక శోభన్ బాబు, సీనియర్ విలేకరులు గడ్డం వెంకటేశ్వర్లు, వీర మోహన్, గుడివాడ శ్రీనివాస్, డానియల్, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: