అంజిరెడ్డి దశదిన కర్మ కు హాజరై వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు సేకరించిన రెండు లక్షల రూపాయలను అందించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క.
మన్యం టీవీ గోవిందరావుపేట:
గోవిందరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ధర్మ అంజిరెడ్డి ఇటీవల మరణించగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ అంజిరెడ్డి అన్న
అకస్మాత్తుగా మరణించడం కాంగ్రెస్ పార్టీకి గోవిందరావుపేట మండలానికి తీరనిలోటు అని ఆయన కుటుంబానికి అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని సీతక్క అన్నారు.
గోవిందరావుపేట, ములుగు మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు సేకరించిన రెండు లక్షల రూపాయలను వారి కుటుంబానికి అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నల్లెల కుమార స్వామి,టిపిసిసి కార్యదర్శి పైడాఆకుల అశోక్, వివిధ మండలాల అధ్యక్షులు, సహకార సంఘం చైర్మన్లు ఎస్సీ, ఎస్టీ, కిసాన్, యూత్, బీసీ సంఘాల జిల్లా మండల గ్రామ నాయకులు సర్పంచులు, ఎంపీటీసీలు మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, మండల జిల్లా నాయకులు మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: