మన్యం టీవీ : ఇల్లందు
దేశంలో కార్మిక వర్గాన్ని అణచివేయలని బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలను చికాగో అమరుల స్పూర్తితో ఎదుర్కోవాలని కార్మిక చట్టాలను సవరిస్తూ ఉన్న ప్రభుత్వ పరిశ్రమలను ప్రైవేట్ పరం చేస్తూ కార్మిక వర్గామ్ లేకుండా చేయాలని మోడీ బీజేపీ ప్రభుత్వం చేస్తుందని కార్మిక వర్గంతో పెట్టుకుంటే బీజేపీ కి పతనం తప్పదని ప్రపంచ వ్యాప్తంగా బూర్జ్వ వర్గాన్ని గడగడ లాడించిన చరిత్ర ఎర్రజెండాకు ఉందని సీపీఎం, సి ఐ టి యు, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు అన్నారు.
ఇల్లందు పట్టణం,మండల సీపీఎం, సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణలు జరిగాయి.ఈ మేడే దినోత్సవంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు అబ్దుల్ నబి,మండల కార్యదర్శి తాళ్లూరి కృష్ణ,వజ్జ సురేష్,మన్నెం మోహన్ రావు, సిఐటియు నాయకులు కూకట్ల, ఎండి అబ్బాస్,నాగరాజు,సుల్తానా,మరియ,మహమూద్,లక్ష్మీ,రాందాస్,ఈసం శంకర్, సుభాని, సుబ్బారావు, లక్ష్మణ్,లక్క రాజేశ్వరావు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: