CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

Share it:

 


మన్యం టీవీ ,మంగపేట:

 మంగపేట మండలం తిమ్మంపేట గ్రామములో కరోనాతో మరణించిన వ్యక్తిని  గ్రామం పక్కనే ఖననం చేశారు .దానితో గ్రామ ప్రజల్లో భయాందోళనలు మొదలయ్యాయి. ప్రభుత్వ స్మశానం ఉన్నప్పటికి గ్రామపంచాయితి వారు   గ్రామ నివాసాల పక్కనే పూడ్చి పెట్టారు.ఇదేమిటీ అని అడిగితే చెరువు శిఖం భూమి ఉంది. ఇది ప్రభుత్వమునకు సంబందించిన భూమి అందుకే ఇక్కడ పూడ్చి పెట్టాం అని నిర్లక్ష్యం తో కూడిన సమాధానం ఇస్తున్నారని గ్రామస్థులు వాపోతున్నారు.శవాలకు దహనం, ఖననం చేయటానికి కావాల్సిన స్మశానాలు ఉండగా ప్రజల ఆవాసాలకు దగ్గరగా కరోనా వచ్చిన వారిని ఖననం చేయడం ఏమిటీ అని ఈ సందర్బంగా గ్రామస్థుడు... దీకొండ కాంతారావు ప్రశ్నించారు. కరోనా అనేది అంటు రోగం అటువంటి రోగం రాకూడదు అంటే భౌతిక దూరం పాటించండి, శానిటైజర్, మాస్క్ లు ధరించండి అని ఒక పక్క చెబుతున్న అధికారులు....మరొక పక్క కరోనా  సోకి చనిపోయిన వ్యక్తి ని నివాసాలకు దగ్గర ఖననం దారుణం అన్నారు.  ఇటువంటి చర్యలవలన గ్రామస్థులు భయాందోళనలకు గురిఅవుతున్నారు. ఇప్పటివరకు ఎవరు ఇక్కడ శవాలు పూడ్చి పెట్టిన సందర్బాలు లేవు, ఈ కరోనా సమయములో     ఇక్కడశవాలను పూడ్చి పెట్టడం వల్ల గ్రామ ప్రజలు ఆందోళనకు గురి అవుతున్నారు.ఈ విషయం పై ఉన్నత అదికారులు  ద్రుష్టి పెట్టి ఇంకొక సారి ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా చూడాలని, చెరువులో  నివాసాలకు దగ్గరలో పూడ్చి పెట్టిన శవాన్నివెంటనే తీయించి ప్రజల భయందోళనలు తగ్గించాలని ఈ సందర్బంగా దళిత నాయకుడు దీకొండ కాంతారావు అధికారులను డిమాండ్ చేశారు.

Share it:

TELANGANA

Post A Comment: