CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వినోబానగర్ అంతర్ జిల్లా చెక్ పోస్ట్ ను సందర్శించిన వరంగల్ నార్త్ జోన్ ఐజి నాగిరెడ్డి...

Share it:

 




 మన్యం టీవీ : జూలూరుపాడు,

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం లోని వినోబానగర్ వద్ద పోలీస్ ఏర్పాటుచేసిన అంతర్ జిల్లా చెక్ పోస్ట్ ను ఆదివారం వరంగల్ నార్త్ జోన్ ఐజి నాగిరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఐజి నాగిరెడ్డి మాట్లాడుతూ.. కరోనా వైరస్ మహమ్మారి నియంత్రించడానికి లాక్ డౌన్ నియమ నిబంధనలు రాష్ట్ర వ్యాప్తంగా అమలులో ఉన్నాయన్నారు. ప్రజలందరూ ఇది గమనించి కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని పోలీస్ శాఖ వారికి సహకరించాలని కోరారు. ప్రభుత్వం సూచించిన ఎమర్జెన్సీ కార్యకలాపాలకు మినహా ఎవరైనా లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి బయట తిరిగి నట్లయితే వారిపైన శాఖపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు ధరిస్తూ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ శానిటైజర్ వాడుతూ ఉదయం 6 గంటల నుండి 10 గంటల లోపల నిత్యావసరాలకు సంబంధించిన వస్తువులు కొనుగోలు చేసుకొని 10 గంటల నుండి ఎవరు బయట రాకుండా ఉంటూ కరోనా మహమ్మారి నియంత్రించడంలో తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని కోరారు. ప్రజల ప్రాణాలను కాపాడడం కోసమే పోలీస్ శాఖ 24 గంటలు పని చేస్తుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలని కోరారు.   

ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సునీల్ దత్, డి.ఎస్.పి వెంకటేశ్వర రాజు, సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు, ఎస్ఐ శ్రీకాంత్, ట్రైనీ ఎస్సై పి వి ఎన్ రావు, సిబ్బంది పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: