చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి.
రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ను ఉల్లంఘించి రోడ్లపై తిరుగుతున్న 10 వాహనాలను చండ్రుగొండ పోలీసులు శనివారం సీజ్ చేసి వారిపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా ట్రైనీ ఎస్ఐ ఎస్ కె నాగుల్ మీరా మాట్లాడుతూ.. మహమ్మారి కరోనా వైరస్ రాష్ట్రవ్యాప్తంగా ఉధృతంగా ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించిందని ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉదయం 6 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు తమకు కావాల్సిన నిత్యావసర సరుకుల కోసం బయటకు రావొచ్చని అలా కాదని 10 గంటల తర్వాత ఎవరు బయటకు వచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అలాగే వారి వాహనాలను సీజ్ చేయాలని రాష్ట్ర డిజిపి ఆదేశాలు ఇవ్వడంతో వారి ఆదేశాల మేరకు మండల వ్యాప్తంగా లాక్ డౌన్ ను పగడ్బందీగా అమలు చేస్తున్నామని అందులో భాగంగా ఈరోజు లాక్ డౌన్ ఉల్లంఘించి తిరుగుతున్న 10 వాహనాలను సీజ్ చేసి వారిపై కేసు నమోదు చేశామన్నారు. అలాగే మండల ప్రజలు కూడా ప్రభుత్వ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని ప్రజలందరూ స్వయ నియంత్రణ లో ఉండి. మాస్కూల్ శానిటైజర్ సామాజిక దూరం పాటించినట్లయితే కరోనా వైరస్ ని కట్టడి చేయగలుగుతాం అని దీనిని ప్రజలందరూ పోలీసువారికి అధికారులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ కృష్ణారావు, కానిస్టేబుల్స్ కోటేశ్వరరావు, రవి, శీను, నరసింహారావు, పాల్గొన్నారు..
Post A Comment: