👉వ్యక్తి మృతి
👉ఏజెన్సీ ప్రజల ప్రాణాలు అంటే అంత అలుసా?
👉108 వాహనం సేవలు గుండాల నుండి కొనసాగించాలి
గుండాల మే 22( మన్యం టీవీ) అనారోగ్యంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది . లక్ష్మీపురం గ్రామానికి చెందిన కల్తీ రామయ్య 55 మృతి చెందాడు. ఆయాసం రావడంతో గుండాల ప్రభుత్వ ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తీసుకువచ్చారు. వైద్య సిబ్బంది మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించాలని సూచించగా స్థానికంగా 108 లేకపోవడంతో ప్రైవేటు వాహనంలో తరలిస్తుండగా కాచన పల్లి సమీపంలో మృతి చెందాడు. 108 అందుబాటులో ఉండి ఉంటే రామయ్య బతికే వాడిని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుండాల 108 వాహనాన్ని కొత్తగూడెం నుండి రావడం వలన మారుమూల మండలంలో ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతున్నారు . ప్రభుత్వ యంత్రాంగం స్పందించి 108వాహనాన్ని గుండాల లో ఉండేవిధంగా చూడాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
Post A Comment: