CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మణుగూరు పిఎసిఎస్ కార్యాలయంలో జీలుగు విత్తనాల పంపిణీ: అధ్యక్షులు కుర్రి నాగేశ్వరరావు

Share it:

 



మన్యం టివి మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు లోని పిఎసిఎస్ కార్యాలయంలో లో శనివారం జీలుగు విత్తనాల పంపిణీ అధ్యక్షులు నాగేశ్వరరావు అగ్రికల్చర్ ఎ డి తాతారావు చేతుల మీదుగా ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ భూమిలో ఈ జీలుగు విత్తనాలు వేసవి దుక్కి దున్ని నప్పుడు వేసి మరలా అది పెరిగి పెద్దది అయిన తర్వాత దమ్ము చేసే సమయంలో లో జీలుగు ను దమ్ములో వేసి తొక్కిస్తే,అవి మగ్గి భూమికి ఎంతో బలాన్ని ఇస్తుంది అన్నారు.రైతులు అధికంగా సేంద్రియ ఎరువులు వాడటం వలన ఎంతో ఉపయోగం ఉంటుందన్నారు.రైతుకు చాలా తక్కువ ఖర్చుతో పంట పండించవచ్చు అన్నారు.రసాయన ఎరువుల వలన భూసారం కూడా దెబ్బ తినడానికి అవకాశం ఉందన్నారు. గవర్నమెంటు రైతులకు ఒక బస్తా 30.కేజీ లకు రూ.1605 కాగా,గవర్నమెంట్ సబ్సిడీ.1043.40 పైసలు పోను,561.60 పైసలకు మాత్రమే అందజేస్తున్నారు అని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఏ ఓ రామశివరావు,ఏఈఓ హారిక,సీఈఓ జ్ఞానదాస్, సిబ్బంది పాల్గొన్నారు.సంత పురి శివ,రైతులు కొంగరి ఉపేందర్ రావ్,తదితరులు విత్తనాలను కొనుగోలు చేయడం జరిగిందని  తెలిపారు.

Share it:

TELANGANA

Post A Comment: