చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి.
మహమ్మారి కరోనా వైరస్ కు మహిళ మృతి చెందిన సంఘటన మండల పరిధిలో చోటుచేసుకుంది వివరాల్లోకి వెళితే.. చండ్రుగొండ మండలం బాలికుంట గ్రామానికి చెందిన దేవల్ల సావిత్రి (45) కు ఈనెల 8 వ తేదీన కరోనా పాజిటివ్ రావడంతో ఆమెను కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి తరలించి వైద్యం అందిస్తున్నారు. శనివారం తెల్లవారుజామున చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచింది. దీంతో ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి. సావిత్రికి భర్త పాపయ్య, ముగ్గురు సంతానం ఉన్నారు. గ్రామస్తుల సహకారంతో మృతదేహాన్ని గ్రామానికి తీసుకువచ్చి దహన సంస్కారాలు నిర్వహించారు.
Post A Comment: