💥మన్యం ఎండీ ,విప్ రేగా కాంతారావు నాకు స్ఫూర్తి:దోడ్డి శ్రీనివాస్
మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని జానంపేట పంచాయతీ భూపతి రావు పేట గ్రామం లో కరోనా బాధితులకు పినపాక మండల మన్యం మనుగడ రిపోర్టర్ దొడ్డి శ్రీనివాస్ నిత్యావసరాలను అందచేయడం జరిగింది. భూపతి రావు పేట గ్రామంలోని కరోనా సోకిన ఐదు కుటుంబాలకు బియ్యం, కూరగాయలు, గుడ్లు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పినపాక మండల ఆదివాసి ఐక్యవేదిక అధ్యక్షులు తోలెం శ్రీనివాస్, కూరగాయల వ్యాపారి సావిత్రమ్మ, దుర్గ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: