గుండాల ( మన్యం టీవీ) ఘనంగా టి పి టి ఎఫ్ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. టి పి టి ఎఫ్ మండల అధ్యక్షులు పోల బోయిన కాంతారావు జెండా ఎగురవేసి అనంతరం వారు మాట్లాడుతూ. టి పి టి ఎఫ్ ఏర్పడి నేటికీ 70 ఏళ్లు అయిందన్నారు. హక్కులకోసం నాటినుండి నేటి వరకు టి పి టి ఎఫ్ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తున్నామన్నారు. తెలంగాణ వచ్చాక టి పి టి ఎఫ్ గా మారిన నాటినుండి మరింత ఉపాధ్యాయ సంక్షేమంతో పాటు సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తూ ముందుకు సాగుతుందన్నారు. కరోనా కారణంగా మరణించిన ఉపాధ్యాయుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు. ప్రకటించిన పిఆర్సి జీవోలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పండిట్ పిఈటి లకు ప్రమోషన్లు ఇవ్వాలన్నారు . దానితోపాటు బదిలీలను కూడా చేయాలని కోరారు . పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఉపాధ్యాయులతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాజు , కవిత, ప్రశాంత్ లు పాల్గొన్నారు
Navigation
Post A Comment: