మన్యం టీవీ, అశ్వాపురం:
మండలంలోని మనుబొతుల పాడు గ్రామపంచాయతీలో ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు నమోదు కాలేదు.ఈ నేపథ్యంలో మండల అధికారుల బృందం శనివారం ఆ గ్రామాన్ని సందర్శించారు.
ఈ సందర్భముగా తాసిల్దార్ వి సురేష్ కుమార్, వైద్యాధికారి మణికంఠ రెడ్డి మండల పంచాయతీ అధికారి శ్రీనివాస్ గ్రామస్థులతో మాట్లాడారు. ఆ గ్రామంలో కరోనా వ్యాధి రాకుండా ఉండేందుకు గ్రామస్తులు తీసుకుంటున్న జాగ్రత్తలపై ఆరా తీశారు.. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎనిక స్వరూపరాణి, విఆర్ఏ ప్రదీప్ , పంచాయతీ కార్యదర్శి సంధ్య పాల్గొన్నారు.
Post A Comment: