మన్యం టీ వీ ,దుమ్ముగూడెం:
కరోనారాక్షసివలన వేలాది కుటుంబాలు వీధిన పడి దిక్కులేనివారు అవుతున్నాయి ఎంతో భవిష్యత్తు ఉన్నవారి ఆయురార్దంమద్యలోనేతెగిపోతోంది.కరోనాబారినపడినవారికి ఆక్సిజన్ అందక చనిపోతున్నారు.తనపైన అభిమానంతోఇంతవాణ్ణిచేసిన ప్రేక్షకదేవుళ్ళకు తనవంతుసహాయానికిముందుకువచ్చిన ప్రఖ్యాత సినీ నటులు చిరంజీవి రెండు రాష్ట్రాలో ప్రతి జిల్లాలో ఆక్సిజన్ కేంద్రాలు తనస్వంతఖర్చుతో ఏర్పాటు చేశారు. అంతకుముందు బ్లెడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ లు ఏర్పాటుచేశారు. వారిసేవలు ప్రచారానికి నోచుకోక పోవటం మనతెలుగువాళ్ళ దౌర్భాగ్యం.""పీతలబుద్దిమనతెలుగువాడిసొంతం"".ఇదిరాజకీయాలకు, ఇమేజ్ పెంచుకోవడానికి సమయంకాదు. కులం మతం అసలే వద్దు ప్రతిఒక్కరూ చేయూతనిద్దాం మనరాష్టాల్లోఅనేక చానల్స్ ,పత్రికలు ఉన్నాయి.అనవసరమైన విషయాలపై బ్రేకింగ్ లు,చర్చాగోష్టులు ,ప్రజలను రెచ్చగొట్టడం పై తెగప్రచారం సిగ్గుచేటు.ఇదిమెగాఅభిమానులకార్యక్రమంకాదు.ప్రజలప్రాణాలు,మానవతా విలువలు ముఖ్యం.రండి కదలిరండి మనచేతనైన సహకారం అందిద్దాం!ఒక కళాకారుడు సేవకార్యక్రమం.మన అందరికార్యక్రమం అని తెలంగాణ నాటక సమాజాల సమాఖ్య సంయుక్త కార్యదర్శి కొమరం దామోదర రావు అన్నారు.
Post A Comment: