CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కరోనా బాధితులను పరామర్శించి నిత్యవసర సరుకులు అందించిన ఎమ్మెల్యే

Share it:

 


*మంగపేట మండలంలో ఎమ్మెల్యే సీతక్క సుడిగాలి పర్యటన.

*పలు కరోనా బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే.

మన్యం టీవీ ఏటూరు నాగారం

మంగపేట మండలంలోని చింతకుంట, దోమెడ, నిమ్మ గూడెం, తిమ్మాపూర్,  బ్రాహ్మణపల్లి, చేరుపల్లి,మల్లూరు గ్రామాలలో పర్యటిస్తూ 67 కరోనా బాధిత కుటుంబాలను పరామర్శిస్తూ నిత్యావసర సరుకులు అందించినారు. అదేవిధంగా నిమ్మ గూడెం గ్రామానికి చెందిన మద్దెల శ్రీను ఇటీవల మరణించగా వారి కుటుంబాన్ని మరియు దోమెడ గ్రామానికి చెందిన హేమాడ్ ఇస్సెన్ లు ఇటీవలే మరణించగా వారి కుటుంబాలను పరామర్శించి నిత్యావసర సరుకులు అందించిన ఎమ్మెల్యే. ఈ కార్యక్రమంలో ఎస్టీ సెల్ జిల్లా  అధ్యక్షులు గుమ్మడి సోమయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇరస వడ్ల వెంకన్న, మండల అధ్యక్షుడు మైల జయరాం రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు చిలుకల మర్రి శ్రీనివాస్, బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి  నరసింహారావు,  సీతక్క యువసేన మండల అధ్యక్షుడు జగదీష్, మండల జీవ వైద్య ప్రధాన కార్యదర్శి రవి, మండల ప్రధాన కార్యదర్శి అయ్యోరు యాణయ్య, ఎండి యూనిస్, సాంబశివ రావు, రమేష్, జంపన్న, బాలకృష్ణ, కొమురం బాలయ్య, సారయ్య, వెంకటేశ్వర్లు, సత్యం, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: