CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బండ్ల పాడు గుత్తి కోయగూడెం లో నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన ములుగు ఎమ్మెల్యే సీతక్క

Share it:

 


*బండ్ల పాడు గుత్తి కోయ గూడానికి ఎడ్లబండిపై బయలుదేరిన ఎమ్మెల్యే.

*లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇబ్బందుల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం.

*కరోనా టెస్టుల శాతం పెంచండి.

మన్యం టీవీ ఏటూరు నాగారం

ములుగు జిల్లా వెంకటాపుర్ మండలంలోని అడవి రంగాపూర్ (నారాయణపూర్) గ్రామాలలోని బండ్ల పాడు గుత్తి కోయగూడెం లో కరోనా నేపథ్యంలో నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన ములుగు ఎమ్మెల్యే సీతక్క. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అని ప్రభుత్వం పేద ప్రజలను ఆదుకో కపోవడం దారుణమని ఊరుకు దూరంగా అడవిని నమ్ముకుని బ్రతుకుతున్న గుత్తి కోయ గూడెం లోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అని గూడెం లో ఉన్న ప్రతి కుటుంబానికి నిత్యావసర సరుకులు అందించడం జరిగిందని అన్నారు. అలాగే ప్రతి పేదవాడి కుటుంబానికి నాలుగు వేల రూపాయలు అందించి ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. కరోనా కట్టడి చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అయినందున కరోనా మహమ్మారి మారుమూల పల్లెల్లో కూడా విస్తరించి ప్రాణాలను కోల్పోతున్నారు. వెంటనే కరోనా టెస్టులు శాతం పెంచాలని లాక్ డౌన్ మూలంగా పనులు దొరకక ఇబ్బందులు పడుతున్న ప్రజలను ప్రభుత్వాలు ఆదుకోవాలని సీతక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నల్లెల కుమార స్వామి, టీపిసిసి కార్యదర్శి పై డా ఆకుల అశోక్, మండల అధ్యక్షులు సూర్యనారాయణ, ఎండి చాంద్ పాషా, వర్కింగ్ కమిటీ అధ్యక్షులు బండి శ్రీనివాస్, సహకార సంఘం మాజీ వైస్ చైర్మన్ కుమారస్వామి, సహకార సంఘ డైరెక్టర్లు భీమ్రావు, గండ్ర కోట మధుకర్, గ్రామ కమిటీ అధ్యక్షులు వెంకట స్వామి, తిరుపతి, ఐలయ్య రాములు, వెంకన్న వెంకటస్వామి, నరేష్, జైపాల్ రెడ్డి,యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షులు మామిడిశెట్టి కోటి, నాయకులు మేడం రమణాకర్, రమేష్ మధుకర్, అశోక్, శ్రీకాంత్ ప్రశాంత్, అరుణ్, నవీన్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: