మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండలంలోని రమణక్కపేట గ్రామంలోప్రమాద వశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు పూర్తిగా కాలిపోయి నిరాశ్రయులుగా మారిన పొనగంటి నాగేష్ కుటుం బానికి ఏటూరునాగారం ఏ. ఎస్.పి. గౌస్ ఆలం ఆధ్వర్యంలో 5000 వేల రూపాయల నగదు 200 కేజీల బియ్యం మరియు నెల రోజులకు సరిపడ నిత్యావసర సరుకులు అందజేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏ.ఎస్.పి. గౌస్ ఆలం తో పాటు ఏటూరునాగారం సి ఐ కిరణ్ కుమార్, మంగపేట ఎస్ ఐ తాహెర్ బాబా, ట్రయినింగ్ ఎస్ ఐ రాజేష్ రెడ్డి సివిల్, సి. ఆర్. పి.ఎఫ్. సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: