CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

టిఎస్పీఎస్సీ ఛైర్మన్ గా జనార్దన్ రెడ్డి

Share it:

 



హైదరాబాద్ :

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్., సభ్యులను బుధవారం, రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నియమించారు. సిఎం కెసిఆర్ ప్రతిపాదనల మేరకు గవర్నర్ ఆమోదించారు.


చైర్మన్ గా .. డా. బి. జనార్ధన్ రెడ్డి (ఐఎఎస్) (వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శిగా ప్రస్థుతం పనిచేస్తున్నారు ) ...

సభ్యులు గా.. రమావత్ ధన్ సింగ్ (బిటెక్ సివిల్, రిటైర్డ్ ఈఎన్సీ)., ప్రొ. బి. లింగారెడ్డి (ఎమ్మెస్సీ పిహెచ్డీ .,ప్రొ. హెడ్ డిపార్డ్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ సిబిఐటి)., కోట్ల అరుణ కుమారి (బిఎస్సీ బీఈడీ., ఎమ్మె ఎల్ ఎల్ బీ., స్పెషల్ గ్రేడ్ డిప్యూటి కలెక్టర్ ) సుమిత్రా ఆనంద్ తనోబా (ఎమ్మే తెలుగు., తెలుగు పండిట్ )., కారం రవీందర్ రెడ్డి (బికాం, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి) ఆరవెల్లి చంద్రశేఖర్ రావు (బి ఎ ఎమ్ ఎస్(ఉస్మానియా)., ప్రాక్టీసింగ్ ఆయుర్వేదిక్ డాక్టర్) ఆర్. సత్యనారాయణ (బిఎ., జర్నలిస్ట్)...లను సిఎం కెసిఆర్ నియమించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను సిఎం కెసిఆర్ ఆదేశించారు..

Share it:

TELANGANA

Post A Comment: