మన్యంటీవీ,అశ్వారావుపేట:మండల పరిధి వినాయకపురంలో ఉపాధి హామీ కూలీలకు తెరాస నాయకులు బిర్రం వెంకటేశ్వరావు మనవరాలు పుట్టినరోజు సందర్భంగా ఉపాధి హామీ కూలీలకు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మాస్కులు, పెరుగు ప్యాకెట్లు పంపిణి చేశారు. చాలా మంది మాటలు చెప్తారు, ఇందుకు భిన్నంగా వినాయకపురం నాయకులు బిర్రం వెంకటేశ్వరావు మాత్రం చేతల్లో చూపారు. ఈ సందర్భంగా తెరాస నాయకులు బిర్రం వెంకటేశ్వరావు మాట్లాడుతూ కరోనా కారణంగా పుట్టినరోజు వేడుకలు చేయడానికి వీలులేదు కాబట్టి పుట్టినరోజు నాడు స్నేహితులకు స్వీట్స్ ఇస్తాను కధ ఆ డబ్బులు తో ఏదో ఒకటి చెయ్ తాతయ్య అని మా మనవరాలు అడిగిందనీ, అందుకని ఈ రోజు ఈ కార్యక్రమం చేయడం జరిగిందని, తన పరిధిలోకి గ్రామంలో ఉపాధి కూలీలకు మాస్కులు, పెరుగు ప్యాకెట్లు పంపిణీ చేసాము అని తెలిపారు.
Post A Comment: