మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని సింగిరెడ్డిపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ కొర్సా .లక్ష్మి రూపవతి ఆధ్వర్యంలో గ్రామంలోని డ్వాక్రా మహిళల అందరికీ కరోనా వైరస్ గురించి అవగాహన కార్యక్రమంను భౌతిక దూరమును పాటిస్తూ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ లక్ష్మీ రూపవతి మాట్లాడుతూ, డ్వాక్రా సంఘాల లీడర్లు అందరూ వారి వారి గ్రూపులకు తప్పనిసరిగా కరోనా వైరస్ కు సంబంధించిన విషయాలను తెలియపరచాలని, ప్రతి ఒక్కరు మాస్కు ధరించి ఉండాలని, ఎవరికి వారు స్వీయ రక్షణ కలిగి ఉండాలని, ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ విధంగా డ్వాక్రా సంఘాలను పిలిపించి గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం పట్ల సింగిరెడ్డి పల్లి పంచాయతీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సర్పంచ్ లక్ష్మీ రూపవతి తీరుపట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని ప్రతి గ్రామంలో ఇదే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లయితే చాలా వరకు కరోనాను నిరోధించే అవకాశం ఉందని సింగిరెడ్డి పల్లి ప్రజలు మాట్లాడుకుంటున్నారు.
ఈ కార్యక్రమంలో డ్వాక్రా వీఓ , డ్వాక్రా సంఘాల మహిళలు, సింగిరెడ్డి పల్లి ఉప సర్పంచ్ పొనగంటి వెంకటేశ్వర్లు, టిఆర్ఎస్ నాయకులు రామయ్య తదితరులు పాల్గొన్నారు
Post A Comment: