✍️కారోనా మృతదేహాల ఖననం కోసం వేల రూపాయల వసూలు చేస్తున్న మాఫియా.
✍️తక్షణమే నిర్వహణ కమిటీను ఏర్పాటు చెయ్యాలి.
✍️మున్సిపల్ అధికారులను కలిసిన సీపీఐ ప్రతినిధి బృందం.
మన్యం టీవీ,పాల్వంచ: పాల్వంచ స్మశానవాటికలో కరోనా బారినపడి మృతిచెందిన వారి మృతదేహాలను ఖననం కోసం సుమారు రూ౹౹ ముప్పై నుండి నలభై వేల రూపాయల వరకు వసూలు చేస్తూ మృతుల బంధువుల రక్తాన్ని పిలుస్తున్న మాఫియా పై చర్య తీసుకోవాలని *సిపిఐ పట్టణ కార్యదర్శి ఆడుసుమల్లి సాయిబాబు* డిమాండ్ చేశారు. మంగళవారం *సీపీఐ ప్రతినిధి బృందం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సానిటరీ ఇన్స్పెక్టర్ వాణి దేవి* ని కలిసి శ్మశానవాటికలో జరుగుతున్న దోపిడీపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్షల రూపాయల ఖర్చు చేసిన అనేకమంది కోవిడ్ తో మరణిస్తున్నారని వారి ఖననం కోసం తీవ్ర మనోవేదన తో స్మశానవాటికలకు తీసుకురాగా మృతుల బంధువుల అమాయకత్వాన్ని బాధను ఆసరాగా చేసుకొని కొంతమంది వ్యక్తులు రాబందుల వలె ముఠాగా ఏర్పడి మృతదేహాల ఖననం కోసం వేల రూపాయలను వసూలు చేస్తున్నారని, తక్షణమే మాఫియాపై చర్యలు తీసుకోవాలని కోరారు. తక్షణమే నిర్వహణ కమిటీను ఏర్పాటు చేసి కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక స్మశానవాటికలో కోవిడ్ మృతదేహాలకు ఉచితంగా లేదా నిర్ణీత డబ్బులు మాత్రమే తీసుకోవాలని ఒక పక్క అధికారులు చెబుతున్నా అవి ఏమీ పట్టనట్టు పాల్వంచలో ముఠా వ్యవహరించటం బాధాకరమని తక్షణమే అధికారులు ఇప్పటికైనా స్పందించి మాఫియాపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబాలను అప్పుల ఊబిలో కూరుకుపోకుండా కాపాడాలని లేనిపక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో బాధిత కుటుంబాల పక్షాన ప్రత్యక్ష పోరాటానికి సిద్ధం అవుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో *సిపిఐ నాయకులు బండి నాగేశ్వరరావు, వీసంశెట్టి విశ్వశ్వరరావు, ఉప్పుశెట్టి రాహుల్, జ్యోతుల రమేష్* తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: