పంచాయతీ సెక్రెటరీ కి ఎంపీపీ హెచ్చరిక
మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని దుగినేపల్లి పంచాయతీలో సోమవారం నాడు కరోనా కేసు నమోదవగా, శానిటేషన్ పనులు చేయాలని, అదే పంచాయతీకి చెందిన ఎంపీటీసీ యగ్గడి ఉమాదేవి స్థానిక సర్పంచ్, పంచాయతీ సెక్రటరీ కి ఫోన్ చేసి తెలుపగా, దురుసుగా సమాధానం వచ్చిందని, ఇదే విషయాన్ని పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీకి తెలియజేయగా, ఆయన వెంటనే స్పందించారు. దుగినేపల్లి పంచాయతీ సెక్రెటరీ కి ఫోన్ చేసి, శానిటేషన్ చేయడంలో నిర్లక్ష్యానికి కారణం ఏంటని ఆరా తీశారు. కరోనా రోగుల పట్ల, కరోనా సోకిన ప్రాంతాలలో నిర్లక్ష్యం వహించకుండా శానిటేషన్ తప్పనిసరిగా చేయాలని, ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని పంచాయతీ సెక్రెటరీనీ హెచ్చరించారు. కరోనా విషయంలో రోగుల పట్ల, నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, వెంటనే స్పందించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. వెంటనే పంచాయతీ సెక్రెటరీ పంచాయతీ వాహనంలో బ్లీచింగ్ పౌడర్ ను తీసుకొచ్చి సిబ్బందితో ఆ ప్రాంతం మొత్తం చల్లించి వెళ్లారు.
Post A Comment: