👉రైతులు ధాన్యం తడవకుండా జాగ్రత్తలు చేపట్టాలి.
👉జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.వి రెడ్డి.
మన్యం టీవీ కొత్తగూడెం
జిల్లాలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించిన నేపథ్యంలో ధాన్యం తడవకుండా రైతులు జాగ్రత్త చేయాలని జిల్లా కలెక్టర్ డా యంవి రెడ్డి తెలిపారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న నాలుగైదు రోజులు పాటు పలు జిల్లాలలో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు సూచించారని ఆయన తెలిపారు
ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయననే వాతావరణ శాఖ సూచన మేరకు ధాన్యం తడవకుండా జాగ్రత్త చేయాలని ఆయన రైతులకు సూచించారు.
Post A Comment: