మన్యంటీవీ,అశ్వారావుపేట:
అశ్వారావుపేట మండలంలో కరోనా చావులు ఆగడం లేదు. ఇప్పటి వరకు సుమారు 25 మందికి పైగా చనిపోగా, మంగళవారం మరొకరరు ప్రాణాలు కోల్పోయారు. వేదాంతపురం గ్రామానికి చెందిన ముమ్మారెడ్డి సూర్యనారాయణ (53) వారం క్రితం అశ్వారావుపేట గవర్నమెంట్ హాస్పిటల్ లో టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. రెండు రోజుల పాటు హోమ్ క్వారంటైన్ లో ఉన్న సూర్యనారాయణ ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడంతో కుటుంబ సభ్యులు రాజమండ్రిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ ట్రీట్ మెంట్ తీసుకుంటూ పరిస్థితి విషమించడంతో మంగళవారం ఉదయం చనిపోయాడని బంధువులు తెలిపారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు . రాజమండ్రిలోనే అంత్యక్రియలు చేశారు.
Post A Comment: