మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండలం రాజుపేట గ్రామానికి చెందిన తెరాస సీనియర్ నాయకులు బండ్ల రవిబాబు అనారోగ్యం తో ఈ రోజు మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు ప్రముఖులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు గ్రామస్తులు తమ ప్రగాఢ సంతాపాన్ని ఈ సందర్బంగా తెలియజేసారు. బండ్ల రవిబాబు రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండే వారని, రాజుపేట గ్రామ అభివృద్ధి కొరకు ఎన్నో మంచి పనులు చేసారని ఇప్పుడు ఉన్న ప్రాథమిక ఉప ఆరోగ్య కేంద్రంనకు కూడా స్థలం ఇవ్వడం కూడా జరిగింది. గతంలో సింగిల్ విండో డైరెక్టర్ గా పదవులు నిర్వహించారు. ముఖ్యంగా గ్రామంలో అందరికి మంచి మనిషి గా గొప్ప కీర్తి ని గడించారని గ్రామస్తులు తెలిపారు.
Post A Comment: