మన్యం టీవీ : జూలూరుపాడు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల కేంద్రం లో బస్టాండ్ లేక ప్రజలు ఎన్నోరకాల ఇబ్బందులకు గురవుతున్నారు. మండల హెడ్క్వార్టర్ మరియు ఎక్స్ ప్రెస్ స్టాప్ ఉండడంతో దూరప్రాంతాలకు పోయే ప్రయాణికులు ఎక్కువగా వస్తుంటారు. నిత్యం ప్రజలు ఎన్నోరకాలుగా వారి అవసరల నిమిత్తం ప్రయాణం చేస్తుంటారు. నిలవ నీడలేక ఎండను సైతం లెక్క చేయకుండా ప్రధాన రహదారి వెంట నిలుచొని బస్సులకోసం ఎదుచూస్తూ ఎన్నో అవస్తలు పడుతున్నారు. మహిళలు, ముసలి వాళ్ళు, నీడ కోసం పక్కనే వున్న షాపులలో నిలుచుందామంటే కరోనా వలన వారుకూడ షాపుల్లోకి రానియని పరిస్థితులు కనబడుతున్నాయి. గతంలో వున్న బస్టాండ్ రోడ్డు విస్తరణ లో కూల్చి అధికారులు వారి పనులు సజావుగా చేసుకొని వెళ్లిపోయారు. ప్రజల కష్టాలను పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు, నిమ్మకు నీరేతినట్టు వ్యవహరించిన తీరు బాధాకరమణి జూలూరుపాడు మండల బిఎస్ పి పార్టీ మండల అధ్యక్షులు తంబర్ల నరసింహారావు, అధికారులను కోరుతూ.. ప్రజల కోసం బస్టాండ్ నిర్మించాలని డిమాండ్ చేసారు.
Post A Comment: