👉ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా పంపిణీ చేసిన ఎమ్మెల్యే వనమా
మన్యం మీడియా కొత్తగూడెం
సుజాతనగర్, లక్ష్మీదేవి పల్లి మండలం లోని ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా పంపిణీ చేసిన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ మైనార్టీలకు టిఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని, ముస్లిం సోదరులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ, మాస్కులు, భౌతిక దూరం పాటిస్తూ రంజాన్ పండగ చేసుకోవాలని, అల్లా దయవల్ల అందరూ మంచిగా ఉండాలని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసినారు.
ఈ యొక్క పంపిణీ కార్యక్రమంలో సుజాతనగర్, లక్ష్మిదేవిపల్లి ఎం ఆర్ ఓ లు శ్రీ సునీల్, నాగరాజు, టిఆర్ఎస్ నాయకులు అన్వర్ పాషా మరియు ఆర్ ఐ లు, రెవెన్యూ అధికారులు, ముస్లిం సోదర సోదరీ మణులు పాల్గొన్నారు.
Post A Comment: