మన్యం టీవీ, అశ్వాపురం:ప్రజల ఆరోగ్యం కోసమే ప్రభుత్వం ఇంటింటి సర్వే చేపడుతోందని మొండి కుంట సర్పంచ్ మర్రి మల్లా రెడ్డి, ఎంపీటీసీ ల సంఘం మండల అధ్యక్షుడు, మొండి కుంట ఎంపీటీసీ కమటం నరేష్ అన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మొండికుంట గ్రామ పంచాయతీ లో జరుగుతున్న ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని సర్పంచ్, ఎంపీటీసీ పరిశీలించారు. ఇంటింటికి వస్తున్న సిబ్బందికి ప్రజలు ఆరోగ్య సమస్యలు, సమాచారం ఇవ్వాలని సర్పంచ్,ఎంపీటీసీ సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: