మన్యం టీవీ : జూలూరుపాడు,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం లోని జూలూరుపాడు, పాపకొల్లు, పడమట నర్సాపురం, లో గల జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలకు నూతన అదనపు తరగతి గదుల భవన నిర్మాణాలకు సోమవారం స్థానిక ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ భూమి పూజ కార్యక్రమం లో పాల్గొని, నూతన అదనపు తరగతి గదుల పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జూలూరుపాడు మండలంలోని 3 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఆర్ ఎం ఎస్ ఏ నిధుల నుండి కోటి రూపాయలు మంజూరి అయినట్లు తెలిపారు. వీటిలో జూలూరుపాడు, హై స్కూల్ కి 30 లక్షలు, పాపకొల్లు, హై స్కూల్ కి 30 లక్షలు, పడమట నర్సాపురం, హై స్కూల్ కి 40 లక్షలు, మంజూరు అయినట్లు తెలిపారు. ఈ నూతన భవన నిర్మాణాలను సకాలంలో పనులు పూర్తి చేయాలని కోరారు. ఈ నిర్మాణ పనులను స్థానిక ప్రజా ప్రతినిధులు స్కూల్ చైర్మన్ లు సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పూర్తి నాణ్యత ప్రమాణాలు పాటించే విధంగా పర్యవేక్షణ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ లావుడ్యా సోనీ, జెడ్ పి టి సి భూక్యా కళావతి, పిఎసిఎస్ చైర్మన్ లేళ్ళ వెంకటరెడ్డి మండల పార్టీ అధ్యక్షులు చౌడం నరసింహారావు, స్థానిక సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: