CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సిఐటియు ఆధ్వర్యంలో రెవెన్యూ కార్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదురుగా నిరసన.

Share it:

 



చండ్రుగొండ మన్యం టీవీ  ప్రతినిధి.


రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం చండ్రుగొండ మండల కేంద్రంలోని మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, రెవెన్యూ కార్యాలయం ఎదురుగా, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘాలు, ఆశా కార్యకర్తలు నిరసన తెలిపారు. అనంతరం సమస్యలతో తో కూడిన వినతి పత్రాన్ని తహశీల్దార్ ఎం ఉష శారద కు అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొండపల్లి శ్రీధర్ మాట్లాడుతూ... కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా ను నియంత్రించడంలో విఫలమయ్యాయని. దేశవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాలు, పెరుగుతున్నప్పటికీ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమకు పట్టనట్టుగా వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్య కేంద్రానికి వచ్చిన వారందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా వ్యాక్సిన్ వేయాలని. అలాగే ఆశ కార్యకర్తలకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం 21 వేల రూపాయలు, పెన్షన్లు మంజూరు చేయాలన్నారు. కరోనా వైరస్ బారిన పడి ఎంతో మంది మధ్య తరగతి. నిరుపేదలు ఎటు వెళ్ళలేక ఇళ్ల వద్దనే ఇబ్బందులు పడుతున్నారని. అలాంటి వారికి ఉచితంగా 25 కేజీల బియ్యం. రూ 7500 భృతి కల్పించాలని. ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆశా కార్యకర్తలు మాట్లాడుతూ.. మాపై పనిభారం పెంచి ఇబ్బందులకు గురి చేస్తున్నారని. అధిక ఒత్తిడితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని. మాకు కనీసం మాస్కులు శానిటైజర్ కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదని. మాపై పని ఒత్తిడి తగ్గించి మాకు సెలవులు మంజూరు చేయాలని. అలాగే పనికి తగ్గ వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో  వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి యాస నరేష్,  సిఐటియు మండల అధ్యక్షులు.. సోము వెంకటచారి, ఆశా కార్యకర్తల  సంఘం అధ్యక్షురాలు రుక్మిని తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: