14 గ్రాముల బంగారం, 90 గ్రాముల వెండి, సెల్ ఫోన్ స్వాధీనం
మన్యం టీవీ అశ్వాపురం:అశ్వాపురం మండలం జగ్గారం లో వాహనం ల తనిఖీ ల్లో అశ్వాపురం సీ ఐ సట్ల రాజు ఆధ్వర్యంలో ఎస్ ఐ రాజేష్ , పోలీసులు అనుమానాస్పదంగా ఉన్న ఒక వ్యక్తి నీ పట్టుకున్నారు. అతని వద్ద 14 గ్రాముల బంగారం, 90 గ్రాముల వెండి, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని విచారించగా నా పేరు అజ్మీర వీరన్న మణుగూరు అని ఈ నెల 3 న అశ్వాపురం లో ఓ ఇంట్లో దొంగ తనం చేసి బంగారం, వెండి, సెల్ ఫోన్ దొంగి లించినట్టు పోలీసుల విచారణ లో ఒప్పుకున్నాడు. అతనిని రిమాండ్ చేశారు.
Post A Comment: