మన్యం టీవీ ఏటూరు నాగారం:
ఏటూరు నాగారం గ్రామస్తులు స్వచ్ఛంద లాక్ డౌన్ పాటిస్తున్నారు. శుక్రవారం వ్యాపారులు, కూరగాయలు, కిరాణా దుకాణాలు, హోటళ్ళు వంటి ఇతర అన్ని వ్యాపారులను మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూసివేశారు. ప్రతిరోజు ఇదే తరహాలో స్వచ్ఛంద లాక్ డౌన్ పాటించేలా తీర్మానించారు. రైతులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, పాత్రికేయులను మినహాయించారు. రోజు రోజుకు మండలంలోని కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. ఇప్పటికే ఏటూరు నాగారం మండలం రామ్ నగర్ గ్రామ పంచాయతీ పప్కాపూర్ గ్రామంలో తల్లీకొడుకులు మృత్యువాత పడగా గురువారం ఏటూరు నాగారం లో బాసిత్ అనే యువకుడు మృతి చెందాడు. రొయ్యూరు, శంకరాజుపల్లి గ్రామాలను కంటె యిన్ మెంట్ జోన్ గా ప్రకటించారు. ఏటూరు నాగారం మండల కేంద్రం లో ప్రస్తుతం 80 శాతం మంది లో వైరస్ వ్యాప్తి చెంది ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే స్థానిక సర్పంచ్ ఈసం రామ్మూర్తి, వార్డు సభ్యులు పలువురు గ్రామ ప్రముఖులు స్వచ్ఛందంగా లాక్ డౌన్ పాటించేలా అధికారుల సమక్షంలో తీర్మానం చేశారు. ఈనెల 20 వరకు కొనసాగించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. కరోనా నియంత్రణకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని సూచించారు.
Post A Comment: