మన్యం టీవీ ఏటూరు నాగారం:
ఏటూరు నాగారం మండల కేంద్రము లో 1వ వార్డు నుండి 16వ వార్డు వరకు మొదలైన కొవిడ్-19 ఇంటి ఇంటి సర్వే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అధికారులు ఇంటి ఇంటికి వెళ్లి ఇంట్లో ఉన్న వారి ఆరోగ్య వివరాలు అడిగి కొవిడ్ సర్వే చేపట్టారు. ఈ సర్వేలో భాగంగా ఏటూరునాగారం మండల కేంద్రంలో 12వ వార్డులో ఇంటి ఇంటి సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సర్వేలో 12వ వార్డు మెంబర్ పడిదల హనుమంతు, వీఆర్వో పాండయ్య, గ్రామ పంచాయతీ కార్యదర్శి రఫిక్,అంగనవాడి టీచర్ భవాని, ఏఎన్ఎం సమ్మక్క, ఆశ వర్కర్ నాగమణి, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: