వాజేడు న్యూస్, వాజేడు మండలం పెద్దగొల్లగూడెం గ్రామ పంచాయితీ లో ఉన్న గోదావరి కి వెళ్ళే రోడ్డు మార్గం లో గ్రామానికి చెందిన స్మశాన వాటికకు వెళ్లే రహదారి ని ఓ రైతు అక్రమించారు.వివరాలు ఇలా ఉన్నాయి. అట్టం శ్రీనివాసరావు అనే రైతు తన సాగు భూమి ని కౌలు రైతులకు వ్యవసాయ భూమి ఇచ్చారు .ఓ కౌలు రైతు స్మశాన వాటికకు కేటాయించిన రహదారిని సగం వరకు దున్నారు. ఈ నేపథ్యంలో గ్రామ పెద్దలు, సర్పంచ్, తహశీల్దార్, రెవిన్యూ ఇన్స్పెక్టర్ రాతపూర్వకంగా ఫిర్యాదు చెయ్యడం జరిగింది. ఈ రహదారిని గోదావరి ఒడ్డున ఉన్న మిర్చి సేల్లలోకి వెళ్ళే మార్గం కావడంతో 2018 లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గతంలో రోడ్డు పోశారు. పరిసర ప్రాంతాల రైతులకు ఈ రోడ్డు మార్గం చాలా అవసరం కాబట్టి అధికారులు తగిన న్యాయం చేయాలని పెద్దగొల్లగూడెం గ్రామస్థులు కోరుతున్నారు.
Post A Comment: