సడలింపులు మధ్యాహ్నం 2వరకు
..
రాష్ట్రంలో కొనసాగుతున్న లాక్ డౌన్ ను రేపటి నుంచి ( మే 31 ) మరో పదిరోజుల పాటు కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సడలింపు ఉంటుంది. సడలింపు సమయం తర్వాత బయటకు వెల్లిన వాల్లు ఇంటికి చేరడానికి మరో గంట పాటు, అంటే మధ్యాహ్నం 2 గంటల వరకు సమయం ఇస్తారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి తెల్లారి ఉదయం ఆరు గంటల దాకా కఠినంగా లాక్ డౌన్ ను అమలు చేయాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఆదివారం నాడు సమావేశమైన రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది.
Post A Comment: