👉కరెంట్ తీగలకు తగిలి శనివారం రాత్రి దుప్పి మృతి
👉ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందజేసిన సీఐ వెంకటేశ్వర్లు
మన్యం టీ వీ, దుమ్ముగూడెం: మండలంలోని ములకనపల్లి గ్రామ శివారులో అటవీ ప్రాంతంలో అడవి జంతువుల వేటకోసం కొంతమంది కరెంట్ తీగలను అమర్చగా విద్యుత్తు ఘాతనికి గురై శనివారం రాత్రి సమయంలో దుప్పి చనిపోవడం జరిగింది.కూబింగ్ లో ఈ విషయం గమనించిన సీఐ వెంకటేశ్వర్లు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీ అధికారులు కేసు నమోదు చేసిన విచారించడం జరుగుతోంది. కొంత మంది అనుమానితులను విచారిస్తున్నట్లు సమాచారం.ఎవరైనా వ్యక్తులు అటవీ జంతువుల వేటకోసం ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయన్నారు. కరెంట్ తీగలకు అటవీ మూగ జీవాలతో పాటుగా ఎవరైనా మనుషులకు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉన్నందున ఇలాoటి చర్యలకు పాల్పడితే అట్టి వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని సీఐ వెంకటేశ్వర్లు హెచ్చరించారు.
Post A Comment: