మన్యం మీడియా, అన్నపురెడ్డిపల్లి:: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అన్నపురెడ్డిపల్లి మండలం, రాజాపురం(నర్సాపురం) గ్రామానికి చెందిన తూలుగుంట్ల సులోచనరాణి అనే మహిళ, కరోనాతో బాధపడుతూ, ఖమ్మంలోని ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొంది, ఇంటికి వచ్చిన క్రమంలో కన్ను , ముఖం వాపు రావడంతో పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రి లో చేరారు. వైద్యులు ఆమెకు బ్లాక్ ఫంగస్ వచ్చినట్లు గుర్తించి, నిర్ధారించుకోవడానికి ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి రిఫర్ చేసినట్లు తెలిపారు. వైద్యులు మాట్లాడుతూ ఇది కొత్త రకం వ్యాధి కాదని, ఎప్పటినుండో ఉన్న వ్యాధి అని, సాధారణంగా చాలా అరుదుగా ఇలాంటి వ్యాధి నమోదవుతుందని, ఈ వ్యాధి ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపించదని, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్లలో ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, ప్రజలెవరూ భయపడవలసిన అవసరం లేదని, వైద్య పరీక్షల అనంతరం ఈ వైరస్కు చికిత్స ఉన్నది కాబట్టి. ప్రజలు భయాందోళనకు గురి కావద్దని, వ్యాధి నిర్ధారణ కోసం హైయ్యర్ సెంటర్ కి రిఫర్ చేయడం జరిగిందని, వ్యాధి తీవ్రతను బట్టి చికిత్స ఉంటుందని వైద్యులు తెలిపారు.
Post A Comment: