మన్యం మీడియా, అన్నపురెడ్డిపల్లి: నిరుపేద కుటుంబంలోని ఆడ పిల్లల కళ్యాణం. ఆ కుటుంబానికి ఆర్థిక భారం కాకూడదనే ఉద్దేశంతో మన తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి పథకం యొక్క ఆర్థిక సహాయం చెక్కులను,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అన్నపురెడ్డిపల్లి మండలం,పెంట్లం గ్రామానికి చెందిన లబ్ధిదారులైన ఇనపనూరి దేవి, కారం శ్యామల, దుగ్గిరాల నాగేంద్ర, నర్సింగ్ తిరుపతమ్మ, భత్తుల నాగేంద్ర లకు సర్పంచ్ సవలం రాణి అందజేశారు. ఈ కార్యక్రమంలో విఆర్ఓ-గొంది సమ్మయ్య, గ్రామ పంచాయతీ కార్యదర్శి-పి రమేష్, గ్రామ పెద్దలు-సవలం ప్రకాష్, గ్రామ పంచాయతీ సిబ్బంది-తాటి నాగరాజు, కోట కిరణ్, తాటి వెంకటేష్, వీఆర్ఏ-ఇనపనూరి లాలు తదితరులు ఉన్నారు.
Post A Comment: