మన్యం టివి,దమ్మపేట:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలం లో ఈరోజు దమ్మపేట తహశీల్దార్ కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వం,ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న,అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు కారోనా విపత్కర పరిస్థితుల్లో కూడా ఆగకుడదనే మంచి ఉద్దేశం తో ఈరోజు 128 మందికి కల్యాణలక్ష్మీ,షాధిముబారక్ పధకం లబ్ధిదారులకు రూ. ఒక కోటి ఇరవైఎనిమిది లక్షల విలువైన చెక్కులను అశ్వరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు చేతుల మీదుగా అందజేసినారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పైడి గారు,సర్పంచ్ ఉయ్యాల చిన వెంకటేశ్వరరావు,ఎంపీపీ సోయ్యం ప్రసాద్,మండల సహకార సంఘం అధ్యక్షులు రావు జోగేశ్వరరావు,ఆత్మ కమిటీ చైర్మన్ కె.వి,వైస్ ఎంపీపీ ధారా మల్లిఖార్జునరావు,మండల అధ్యక్షులు దొడ్డాకుల రాజేశ్వరావు,నియోజకవర్గ నాయకులు జారే ఆదినారాయణ,పార్టీ నాయకులు అబ్ధుల్ జిన్నా,మండల అదికారులు తహసీల్దార్,వెటర్నరీ డాక్టర్ మన్యం రమేష్,మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: