మన్యంటీవీ,అశ్వారావుపేట:
అఖిల భారత రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మూడు నల్ల చట్టాలను రద్దు చేయనందుకు నిరసనగా బ్లాక్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ గత 6నెలల నుండి 500 రైతుసంఘాల ఆద్వర్యంలో జరుగుతున్న పోరాటం ఈ రోజుతో ఆరునెలలు పూర్తి చేసుకొని యేడవ నెలలోకి అడుగు పెడుతున్న సందర్బంగా దేశవ్యాఫితంగా కేంద్ర ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బ్లాక్ డే కార్యక్రమం జరుగుతుందని, దానిలో భాగంగానే అశ్వావుపేట సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కార్యాలయంలో సిపిఐ, న్యూ డెమోక్రసీ పార్టీల ఆద్వర్యంలో భ్లాక్ డే కార్యక్రమం సందర్భంగా నల్లజెండా ఎగురవేసి నిరసన తెలియజేస్తున్నామని, రైతు వ్యతిరేఖ నల్లచట్టాలను వెంటనే రద్దుచేయాలని, అన్ని రకాల పంటలకు మద్దతు దర నిర్ణయిస్తూ పార్లమెంటులో చట్టంచేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు గోకీనేపల్లి ప్రభాకర్, ఐఎఫ్టియు నాయకులు రాజనాల కృష్ణ, ప్రగతిశీల మహిళా సంఘం నాయకులు గంగ, కె.విజయ, సిపిఐ జిల్లా నాయకులు యస్ ఢి సలీమ్, యస్ ఢి రఫి, మండల కార్యదర్శి, జి రామకృష్ణ, సంగా కృష్ణమూర్తి, తదితరులుపాల్గొన్నారు.
Post A Comment: