మన్యం మనుగడ,పినపాక:
పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం లో ఏ ఎస్పీ శబరిష్ ఆకస్మిక పర్యటన చేశారు. స్థానిక సీఐ దోమల రమేష్, సబ్ ఇన్స్పెక్టర్ టి వి ఆర్ సూరితో కలిసి
ఏడూళ్ల బయ్యారం క్రాస్ రోడ్ నుండి పంచాయతీలో వీధివీధి తిరుగుతూ లాక్ డౌన్ పరిస్థితిని సమీక్షించారు. రోడ్లపై అనుమతి లేకుండా తిరుగుతున్న వాహనాల పై కేసు నమోదు చేశారు. మారుమూల ప్రాంతాల్లో సైతం, చిన్న చిన్న సందుల్లో ఆయన తిరుగుతూ లాక్డౌన్ పరిస్థితిని పూర్తిగా సమీక్షించారు. నిబంధనలను పాటించకుండా ఉంటే కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. దుకాణదారులు ఉదయం 9:45 లోపే మూసివేయాలని అని లేనిపక్షంలో కేసులు తప్పవని ఆయన హెచ్చరించారు. అనుమతి లేకుండా ఎవరైనా బయటికి వస్తే చర్యలు కఠినంగా ఉంటాయన్నారు
Post A Comment: