మన్యం టీవీ,పాల్వంచ :
పీపుల్ హెల్పింగ్ చిల్డ్రన్(పీహెచ్సీ) ఎన్జీఓ అధ్వర్యంలో మంగళవారం కామేపల్లి మండలం అడవి మద్దులపల్లి గ్రామ పంచాయతి పరిధిలోని అటవీ ప్రాంతంలో నివసిస్తున్న గుత్తికోయలకు మాస్క్ ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, పరిశుభ్రతను పాటిస్తూ మాస్క్ ధరించాలని కోరారు. చిన్నారులు కరోనా పట్ల పలు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీహెచ్సీ ఆక్టివ్ మెంబర్ కౌశిక్ మేకల, ఓంకార్, వెంకటాచారి రేవూరి, సౌజన్య రాయిరాల పాల్గొన్నారు.
Post A Comment: