CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జూలూరుపాడు లో పత్రిక విలేకరులకు మాస్కులు శానిటైజర్ లు పంపిణీ చేసిన బిజెపి రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యదర్శి చిలుకూరి రమేష్ ..

Share it:




మన్యం టీవీ : జూలూరుపాడు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం లో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులకు కు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఏడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్ మాస్కులు శానిటైజర్ లు ఆదివారం పంపిణీ చేశారు. సందర్భంగా మాట్లాడుతూ.. మన ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఏడు సంవత్సరాల కాలంలో అవినీతి లేకుండా పరిపాలన సాగిస్తున్నారని అన్నారు.కరోన తో ఇబ్బంది పడుతున్న ప్రజలకు దేశవ్యాప్తంగా ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తున్నారని అన్నారు. ఇప్పటికే 20 కోట్ల కు పైగా వ్యాక్సిన్ డోసులు ప్రజలకు వేశారన్నారు. ఈ రోజు జూలూరుపాడు మండలం లో వివిధ గ్రామాల్లో పారిశుద్ధ్య కార్మికులకు బియ్యం, మరియు మాస్కులు, డెటాల్ సోపులు, ప్రజల కొరకు నిత్యం వార్తలు సేకరించడానికి బయట తిరుగుతున్న పత్రిక మిత్రులకు మరియు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు మరియు పోలీస్ శాఖ వారికి, ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బందికి మాస్కులు ,శానిటైసర్లు బీజేపీ కిసాన్ మోర్చా సేవాహి సంఘటన ఆధ్వర్యంలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్ అందజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కోశాధికారి నున్న రమేష్ ,బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు మాది నేని సతీష్, బిజెపి మండల అధ్యక్షులు సిరిపురపు ప్రసాద్, ఓబీసీ మండలాధ్యక్షుడు వుర్లమోటి రవి, మండల ప్రధాన కార్యదర్శి భూక్యా రాజేష్, భానోత్ సురేష్, గోపాలరావు, పుల్లారావు, కొండ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: