CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

తెరాస నాయకుల ఆధ్వర్యంలో కరోనా బాధితులకు నిత్యావసర సరుకులు అందజేత

Share it:

 


మన్యం టీవీ మంగపేట.

మంగపేట మండలం రాజుపేట గ్రామపంచాయతీ పరిధిలోని గ్రామాల బాధితులకు తెరాస నాయకుల ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్బంగా తెరాస ముఖ్య నాయకులు యడ్లవల్లి నరసింహారావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కొంతకాలం సంయమనం పాటిస్తూ అత్యవసర పరిస్థితిలలో తప్ప బయటకు రాకూడదు.తప్పని పరిస్థితుల్లో వచ్చినప్పుడు మాస్క్ దరించి భౌతిక దూరం పాటించాలని, ఇంటికి వెళ్ళాక శానిటైజర్తో లేదా సబ్బుతో కానీ చేతులు శుభ్రపర్చుకోవాలని శానిటైజర్, మాస్క్, భౌతిక దూరం పాటించడమే మనకు శ్రీ రామ రక్ష అని ఈ సందర్బంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా జీవ వైవిధ్య డైరెక్టర్ కర్రీ శ్యాంబాబు, బండ్ల చినబాబు, పోలిన హరిబాబు మద్దిపాటి త్రిమూర్తులు, మలికంటి శంకర్, చదలవాడ సాంబశివరావు, కర్రి కేశవరావు, పేరయ్య, రాయసాబ్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: