- దోసపాటి పిచ్చేశ్వరరావు
మన్యం టీవీ,అశ్వాపురం: తమ ప్రాణాలను పణం గా పేట్టి ప్రజలకు నిరంతరం వైద్య సేవలు అందిస్తున్నారని వైద్య సిబ్బంది లో నర్సుల పాత్ర కీలకం అని శివకామేశ్వరి గ్రూప్స్ డైరెక్టర్ దోసపాటి పిచ్చేశ్వరరావు అన్నారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా అశ్వాపురం పీ హెచ్ సీ లో పిచ్చేశ్వరరావు ఆధ్వర్యంలో నర్సుల దినోత్సవం నిర్వహించారు. వైద్యాధికారి మణీకంటా రెడ్డి సమక్షంలో నర్సుల చేతుల మీదుగా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాణాలను పణంగా పెట్టి, బంధాలను దూరం పెట్టి, బాధ్యతలను విధులను నిర్వహిస్తున్నారని నర్సుల సేవలు కొనియాడారు.
కరోనా ను ఎదురుకోవడంలో విరామమే లేకుండా ముందుండి పోరాడుతున్న
కరోనా పోరాటంలో నర్సులు చూపే ధైర్యానికి సెల్యూట్ అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏ ఎన్ ఎంలు, స్టాప్ నర్సులు, సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: