మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండల వ్యాప్తంగా కోవిడ్ పాజిటివ్ వచ్చిన ఆదివాసీ వ్యక్తులకు ఐ టి డి ఏ ద్వారా 80 నిత్యావసర వస్తువుల కిట్స్ మండలంనకు పంపించారు. ఒక్కొక్క కిట్ లో 11 రకాల నిత్యావసర సరుకులు కలవు. అట్టి నిత్యావసర సరుకుల కిట్స్ లను వి ఆర్ ఓ, వి ఆర్ ఏ ల ద్వారా సంబంధిత వ్యక్తులకు ఇంటి వద్దకు అందజేయడం జరిగింది. ఈ సందర్బంగా మంగపేట తహసీల్దార్ బాబ్జి ప్రసాద్ మాట్లాడుతూ కోవిడ్ పాజిటివ్ వచ్చిన వ్యక్తులు డాక్టర్స్ సలహా మేరకు మందులు వాడుతూ బలవర్ధకమైన, పోషక విలువలు కలిగినటువంటి ఆహారాన్ని తీసుకోవాలని, ఎప్పుడైతే శారీరకంగా మానసికంగా దృఢత్వం కలిగి ఉంటారో అప్పుడు కరోనాను జయించడం సులభతరం అవుతుంది అని ఈ సందర్బంగా తహసీల్దార్ బాబ్జి ప్రసాద్ తెలియజేసారు.
Post A Comment: