CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆశా వర్కర్ లను శాలువాలతో సన్మానించి చీరలను పంపిణీ చేసిన ములుగు ఎమ్మెల్యే సీతక్క

Share it:

 


*కన్నాయిగూడెం మండల కేంద్రంలో లాక్ డౌన్ నేపథ్యంలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి భోజనం అందించిన ఎమ్మెల్యే.

*కరోనా బాధిత కుటుంబాలను పరామర్శించి నిత్యావసర సరుకులు అందించిన ఎమ్మెల్యే.

మన్యం టీవీ ఏటూరు నాగారం:

కన్నాయిగూడెం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 40 మంది ఆశ వర్కర్ల శాలువాలతో సన్మానించి చీరలను అందించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క అదేవిధంగా కరోనా నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేస్తూ తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వెంకన్న సహకారంతో భోజనం అందించిన సీతక్క. కరోనా బాధిత కుటుంబాలకు పరామర్శించి నిత్యావసర సరుకులు అందించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుత కరోనా వైరస్ కట్టడి చేసేందుకు వైద్యులతో కలిసి కరోనా వైరస్ కట్టడి కి వేలసంఖ్యలో ఆశ వర్కర్లు, ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఆ వైరస్ తమని అంతం చేస్తుందని తెలిసికూడా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సేవలు చేస్తున్న ఆశ వర్కర్లు, ప్రమాదం అంచున నిలబడి వైరస్ బారిన పడిన వారిని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. నిరంతరం పోరాటం చేస్తున్న వీరి కృషి మరువలేనిదని ఈ విపత్కర సమయంలో ఒక యజ్ఞం వలె సేవలు అందిస్తున్న సేవలకు వెలకట్టలేము, పరమాణు సోకితే కన్నబిడ్డ అయినా తాకలేము బంధువులైన ప్రాణ స్నేహితులు సరే దగ్గరికి రా లేరు. అలాంటి సమయంలో సేవలందిస్తున్న ఆశ వర్కర్లకు ప్రత్యేక ధన్యవాదాలు అని అన్నారు. అదేవిధంగా కరోనా నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేస్తూ విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది సేవలు మరువలేనివని కొనియాడారు.

 ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నల్లెల కుమార స్వామి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వెంకన్న, మండల అధ్యక్షులు అప్సర్ పాషా, ఏటూరు నాగారం మండల అధ్యక్షులు రఘు, కన్నాయిగూడెం ఎంపీపీ జనగం సమ్మక్క, వైస్ ఎంపీపీ బొల్లె భాస్కర్, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు రాజబాబు, కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు రమేష్, ఎస్సి సెల్ మండల అధ్యక్షులు రాంబాబు, ఎంపిటిసి శైలజ అరుణ్ కుమార్, బీసీసెల్ మండల అధ్యక్షులు కటకం మల్లయ్య, గ్రామ కమిటీ అధ్యక్షులు సత్యనారాయణ, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బోట నగేష్, సర్పంచ్ చింత చంద్రయ్య, జిల్లా నాయకులు జాడీ రాంబాబు, నర్సింగరావు, సుధాకర్, గడ్డం నగేష్, మల్లయ్య, చిన్న నారాయణ, నగేష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: