మన్యం టీవీ, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో సుమారు 58 మంది ఆశ వర్కర్లు కరోనా కష్టకాలంలో కరోనా నిర్మూలనకు తన ప్రాణాలను సైతం లెక్కచేయక తన వంతు బాధ్యతగా విధులు నిర్వహిస్తున్నారు. ఆశా వర్కర్లకు కనీస వేతనం చెల్లించకపోవడం అనేది బాధాకరం. కనీస వేతనం కొరకు ఆశావర్కర్లు ఒక్కరోజు విధులు బహిష్కరించారు.ఈ ప్రభుత్వం వెంటనే తమ డిమాండ్ ను పరిగణలోకి తీసుకుని న్యాయం చేయవలసిందిగా కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో వాజేడు , పేరూరు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
Post A Comment: