CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మేడారం జాతర పై సమీక్ష సమావేశం

Share it:

 


మన్యం టీవీ ఏటూరు నాగారం:

జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో మేడారం జాతర పై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.2022 సంవత్సరానికి ఫిబ్రవరి 16, 17 ,18, 19 తేదీల్లో జరిగే అతిపెద్ద మహాజాతర జరుపుకునే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర పై జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారుల సమన్వయ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు గత ఏడాది నిర్వహించిన జాతర దృష్టిలో పెట్టుకొని వచ్చే జనాభాకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. జాతర ఏర్పాట్లలో భాగంగా ఆర్ & బి, ఇరిగేషన్, వైద్య ఆరోగ్య శాఖ మరియు ఇతర శాఖలచే నిర్వహించే పనుల ప్రతిపాదనలు త్వరితగతిన పూర్తి చేసి పంపించాలని కలెక్టర్ అన్నారు. ముఖ్యంగా కోవీడ్ నిబంధనలు పాటించే క్రమంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ఆయా శాఖలతో సమీక్షించారు. 

ఈ కార్యక్రమంలో ఐ.టి.డి.ఎ పి ఓ హనుమంతు కె జెండా గే, అదనపు కలెక్టర్ ఆదర్శ సురభి, జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, ఆర్ అండ్ బి ఇ ఇ వెంకటయ్య ,ఇరిగేషన్ ఇ ఇ మాణిక్యరావు, దేవాదాయ శాఖ అధికారి రాజేందర్ మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: